Sunday, May 25, 2014

హైందవ ధర్మంతో చెలగాటమా?

ఎన్నో (వేరే) మత గ్రంధములలో వ్రాయబడిన వాఖ్యాలు అన్నియు తెలిపేది భగవంతుడు నిరాకారుడు అనియు, సర్వానికి ఒకడే అధికారి అనియు మరియు దేవుడు ఉన్నది ఒక్కడే అనియు తెలుపబడినది అని చెప్తూ ఉంటారు.

ఈ పైన చెప్పబడిన పరమాత్ముని నిరాకర తత్వమును మొట్ట మొదట ఈ సమస్త జగత్తుకు తెలుపబడిన మొదటి ధర్మం మన హైందవ ధర్మమే అని తెలియజేయండి.

మన హిందూ వేదాలలో, ఉపనిషతులలో మరియు భగవద్గీతలో తెలుపబడినది కూడ ఆ పరమాత్ముడు నిరాకారుడు, నిర్గుణుడు, శాస్వితుడు, సత్యుడు మరియు నిత్యుడు అని మాత్రమే తెలుపబడినది అని తెలియజేయండి.

ఇదియే కాక ఆ పరమాత్ముడిని మన శరీరంలోనే సంపూర్ణ దర్శనం పొందే మార్గాలను సైతం తెలుపబడిన ధర్మం మన హైందవ ధర్మమే అని చాటి చెప్పండి.

ఆ నిరాకర పరమాత్మే సాకార రూపంగా వివిధ రూపాలలో అవతరించి అంతరించిపోతున్న జ్ఞానాన్ని మరియు ధర్మాన్ని నిలబెట్టడానికి సాకార రూపంలో అవతరిస్తుంటాడు అని తెలుపండి.

మన హైందవ ధర్మంలో ఆచరించే ప్రతిది ఒకే ఒక ఆత్మ జ్ఞానంతో ముడిపడి ఉంటుంది అని తెలుపండి.

అన్ని మత గ్రంధాలో లిఖించబడినటువంటి వాక్యాలు అన్నియు మన వేదాలలో ఎప్పుడో తెలుపబడినవి అనియు మరియు ఆ దేవదేవుడి నిరాకర స్వరూపాన్ని మరియు సర్వాకాల సర్వ వ్యవస్థలకు మూల కారకుడు ఆ దేవదేవుడైన ఆ పరమాత్ముడు అని ఏ నాడో మన వేదాలలో మరియు చివరన ఉన్న ఉపనిషత్తులలో సవివరంగా వివరించబడినాయి అని తెలుపండి.

మతాలూ మరియు కులాలు వేరైనా దేవుడు ఒక్కడే అని తెలిపిన ధర్మం మన హైందవ ధర్మం అని సవివరంగా మన హైందవ ధర్మం గురించి చక్కటి వివరణ ఇవ్వండి.

ఓం నమో పరమాత్మయే నమః

No comments:

Post a Comment